మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి

కర్నూలు  : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు డీఈఓ కి శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ధనమే ధ్యేయంగా ఫీజుల దోపిడి చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు నగరంలో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా పరీక్షల ఒత్తిడి తీసుకొస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో అంగట్లో సర్కుల్లాగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టై లు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని అన్నారు. కావున తక్షణమే విద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు అస్లాం భాష, రవి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు.

శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…

6 hours ago

మహిళను నమ్మించి మోసం చేసిన వీఆర్వో.

గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…

8 hours ago

ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…?

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…

4 months ago

జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి

అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…

5 months ago

యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్

కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ…

5 months ago

దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ : పవన్ కళ్యాణ్

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన…

6 months ago